జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఆమోదం
జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో ఈ వివరాలను వెల్లడిరచారు.జాన్సన్ అండ్ జాన్సన్కు అత్యవసర వినియోగం కోసం ఆమోదం దక్కడంతో.. భారత్లో వినియోగించనున్న అయిదవ టీకా కానుంది. యురోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మన వద్ద ఉన్నాయనిమంత్రి ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే ఈ వ్యాక్సిన్కు అనుమతి లభించింది.