Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

త్వరలో గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు

వెయ్యికి పైగా పోస్టుల భర్తీ
సీఎం జగన్‌ ఆమోదం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. గురువారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు అందజేశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వారు వెల్లడిరచారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా వెయ్యికిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సీఎం సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img