Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దద్దరిల్లిన పార్లమెంటు

. అదానీ వ్యవహారం… రాహుల్‌ అనర్హతపై విపక్షాల నిరసన
. నల్ల దుస్తులతో ఎంపీల ఆందోళన

న్యూదిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత, అదానీ గ్రూప్‌ వ్యవహారంపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారం వాయిదాపడ్డాయి. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు అనేక విపక్ష పార్టీల ఎంపీలు కూడా నల్ల దుస్తులు ధరించి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఉభయ సభలు వాయిదా పడటంతో పార్లమెంటు ప్రాం గణంలో సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌, విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా పాల్గొని సోనియా గాంధీ ముందు కూర్చుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. రాహుల్‌పై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై విపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ప్రారంభమైన కేవలం నిమిషానికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా సాయం త్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైన వెంటనే చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ గందరగోళం మధ్య బిల్లులను తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. సభ మొదట జమ్ముకశ్మీర్‌ బడ్జెట్‌ను, తరువాత విభజన బిల్లులు, ఆర్థిక బిల్లు-2023ని తిరిగి ఇచ్చింది. ఆర్థిక బిల్లును చర్చకు తరలిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం లోక్‌సభ ఆమోదించిన బిల్లులో సెక్యూరిటీల లావాదేవీల పన్ను రేట్లను సరిచేయడానికి సవరణను ప్రవేశపెట్టారు. ధన్కర్‌ సభ్యులను చర్చకు ఆహ్వానించినప్పటికీ, ప్రతిపక్ష ఎంపీలు అదానీ అం శంపై చర్చించాలని, ఈ అంశంపై సంయుక్త పార్లమెం టరీ కమిటీ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. తరువాత బిల్లులు చర్చ లేకుండా మూజు వాణి ఓటు ద్వారా లోక్‌సభకు తిరిగి వచ్చేలా ఆమోదం పొందాయి. లోక్‌సభ కూడా ఈ బిల్లులను గత వారం చర్చ లేకుండానే ఆమోదిం చింది. అనంతరం రాజ్యసభను మంగళవారానికి వాయిదా వేశారు. లోక్‌సభకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ అనర్హత వేటుకు నిరసనగా మధ్యాహ్న భోజనానికి ముందు జరిగిన సెషన్‌లోనూ ప్రతిపక్ష ఎంపీలు నల్ల బట్టలు ధరించి అదానీ అంశంపై దుమారం సృష్టించారు. చైర్మన్‌ ధన్కర్‌ తన స్థానంలో కూర్చోకముందే కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
లోక్‌సభలో గందరగోళం
లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి వెల్‌లోకి దూసుకెళ్లారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు స్పీకర్‌ స్థానం వైపు కాగితాలు విసిరారు. రాహుల్‌ గాంధీ అనర్హత, అదానీ సమస్యపై గందరగోళం కొనసాగ డంతో సోమవారం సాయంత్రం 4 గంటల వరకు సభ వాయిదా పడిరది. సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు నల్ల కండువాలు ధరించి నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని వెల్‌లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు టి.ఎన్‌.ప్రతాపన్‌, హిబీ ఈడెన్‌ కండువాలతో పాటు ఆర్డర్‌ పేపర్లను కుర్చీపైకి విసిరారు. ‘ప్రియమైన ఈడీ దారో మత్‌, అదానీ పర్‌ రైడ్‌ కరో (ఈడీకి భయపడవద్దు, అదానీపై దాడి చేయండి)’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నల్ల కండువా ధరించగా, ఆమె పార్టీకి చెందిన ఇతర సభ్యులు నల్ల చొక్కాలు ధరించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా నల్ల కుర్తా ధరించారు. విపక్ష సభ్యుల నిరసన మధ్య లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయంలో సభ ప్రారంభమైన నిమిషం లోపే సభను వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img