Friday, April 19, 2024
Friday, April 19, 2024

దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవదహనం

దేశ రాజధాని దిల్లీలో ఘరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోకుల్‌పురి ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. ఆ ప్రాంతంలోని ఓ పూరి గుడిసెలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అంటుకుకోని క్రమంగా అవి ఆ ప్రాంతం మొత్తం వ్యాపించడంతో సుమారు 60 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పివేయడానికి నాలుగు గంటల సమయం తీసుకున్నదని డీఎస్పీ దేవేశ్‌ కుమార్‌ మహ్లా చెప్పారు. ఘటనా స్థలంలో ఏడు మృతదేహాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడిరచారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విచారం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img