Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిల్లీలో మరో దారుణం.. బాలికపై యాసిడ్‌ దాడి..

దిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ద్వారక జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న బాలికపై ఓ బాలుడు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో తాము కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని దిల్లీ పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img