నగరంలో నేటి నుంచి కేవలం సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకే అనుమతి
దేశ రాజధాని దిల్లీ సహా ఎన్సీఆర్లో వాయు కాలుష్య పరిస్థితి మరోసారి తీవ్రమైంది. తక్కువ ఉష్ణోగ్రతలు, నెమ్మదైన గాలుల కారణంగా ఏర్పడిన అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 386గా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఢల్లీిలో వాయు కాలుష్యం పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నారు. ఢల్లీిలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా డిసెంబర్ 3వతేదీ వరకు అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాల రవాణాపై నిషేధం విధించారు. .‘‘ఢల్లీిలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢల్లీి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఢల్లీి వెలుపల నుంచి అత్యవసరమైన సేవల ట్రక్కులు మినహా ఇతర వాహనాల ప్రవేశం నిలిపివేశాం’’ అని ఢల్లీి పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అంతకు ముందు నవంబరు 18వతేదీన నిత్యావసర వస్తువులు తీసుకువచ్చేవి మినహా ఇతర రాష్ట్రాల ట్రక్కులను రాజధానిలో ప్రవేశించడాన్ని ఢల్లీి సర్కారు నిషేధించింది.మరోవైపు, ఢల్లీిలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు నవంబర్ 29 నుంచి తిరిగి తెరవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఢల్లీి, ఎన్సీఆర్ లలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించారు. అయితే ప్లంబింగ్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్, విద్యుత్, వడ్రంగి లాంటి కాలుష్య రహిత పనులు చేసుకోవచ్చు. ఢల్లీిలో శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 368 నమోదైందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ తెలిపింది. అయితే, గాలి వేగం పెరగడం వల్ల నవంబర్ 29 నుంచి ఏక్యూఐ గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కు చెందిన ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఏజెన్సీ ‘సాఫర్’ తెలిపింది.