దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం తీవ్రతపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) సలహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్, పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్తో చీఫ్ సెక్రటరీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు.ఢల్లీి-ఎన్సీఆర్లో వాయు కాలుష్యతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. రెండ్రోజులు లాక్డౌన్ విధిస్తారా, ఇంకేమైనా చేస్తారా, ప్రజలు ఎలా బతకాలి? అని నిలదీసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ శీతాకాలం వేళ దిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దాని విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.