Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దిల్లీ చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌..

కేంద్రమంత్రులు, బీజేపీ నేతలతో భేటీకి ఛాన్స్‌
జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ దిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గతవారమే దిల్లీ వెళ్లొచ్చారు. ఇంతలో జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. పవన్‌ ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లారు.. ఇవాళ దిల్లీకి చేరుకున్నారు. జనసేన అధినేత వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ దిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ప్రధాని కేంద్రమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాతో భేటీ ఉంటుందని చెబుతున్నారు. జనసేనాని ప్రధానంగా ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై కమలదళం పెద్దలతో చర్చిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే విపక్షాలపై దాడుల వ్యవహారాన్ని కేంద్రంకు వివరిస్తామని పవన్‌ అన్నారు.. దీంతో జనసేనాని సడన్‌ హస్తిన టూర్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img