Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిల్లీ నుంచి చేసే దాదాగిరి..ఇక చెల్లదు : మమతా బెనర్జీ

కేంద్రం పిడికిలి నుంచి గోవాను రక్షిస్తానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మూడు రోజుల గోవా పర్యటనలో భాగంగా రాజధాని పనాజీలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దిల్లీ నుంచి చేసే దాదాగిరి ఇక నుంచి చెల్లదని అన్నారు. తానే బయటి వ్యక్తిని కాను అని..తాను ఇండియన్‌ని అని అన్నారు. ‘దేశంలో ఎక్కడికైనా వెళ్తాను. బెంగాల్‌ నా మాతృ గడ్డ అయితే గోవా కూడా నా మాతృ గడ్డే. వాళ్లు(బీజేపీ కార్యకర్తలు) నా పోస్టర్లు చింపేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేప్పుడు నల్ల జెండాలు చూపించారు, వారికి నమస్తే చెప్పాను. నేను మళ్లీ చెప్తున్న. గోవాలో ముఖ్యమంత్రిని గెలుచుకునేందుకు రాలేదు. కేంద్ర ప్రభుత్వ దాదాగిరిని అడ్డుకుని గోవాను రక్షించుకునేందుకు వచ్చాను’ అని మమత అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img