Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో ఎండ్‌మిక్ దశకు కొవిడ్-19.. మరో 12 రోజులపాటు కరోనా విజృంభణ!

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. అయితే, వైరస్ ఆటలు మరెన్నో రోజులు సాగవని, గరిష్ఠంగా మరో 12 రోజులపాటు వైరస్ ఉద్ధృతి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో కొవిడ్ ఎండ్‌మిక్ దశకు చేరుకుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసుల ఉద్ధృతి మరో 12 రోజులపాటు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్, దాని ఉపరకం ఎక్స్‌బీబీ. 1.16 కారణమని, కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని అంటున్నారు. ఆసుపత్రిలో చేరికలు, మరణాలు పెరుగుతున్న దాఖలాలు కూడా లేవు. కాగా, నిన్న దేశవ్యాప్తంగా 7,830 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 40 వేలకు చేరుకున్నాయి. అలాగే, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11 మంది మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే 9 మంది మరణించగా, 1,115 మంది కరోనాకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img