Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కరోనా కొత్త వేరియంట్‌

తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో గుర్తింపు
కనుగొన్న ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త

ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి నిర్మూలన కావట్లేదు. ఏదో ఒక కొత్త రూపంలో పుట్టుకొస్తూనే ఉంది.. గడగడలాడిస్తోనే ఉంది. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో రోజువారీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల పెరుగుదల కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఢల్లీి, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటోంది.ఈ పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్‌ కొత్త బాంబు పేల్చింది. భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు వెల్లడిరచింది. భారతదేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన సరికొత్త వేరియంట్‌ను గుర్తించినట్టు ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ షే ఫ్లీషాన్‌ తెలిపారు. దేశంలోని పది రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ బీఏ.2.75 సబ్‌ వేరియంట్‌ను గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. టెల్‌ హాషోమర్‌లోని షెబా మెడికల్‌ సెంటర్‌లోని సెంట్రల్‌ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీఫ్లాన్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు.ఇప్పటి వరకు ఇండియా (పది రాష్ట్రాల నుంచి) అలాగే, ఏడు ఇతర దేశాల నుంచి 85 స్వీక్వెన్స్‌లు అప్‌లోడ్‌ చేసినట్టు చెప్పారు. అయితే, ఇండియా వెలుపల స్వీక్వెన్స్‌ల నుంచి ఎలాంటి ట్రాన్స్‌మిషన్‌ను ట్రాక్‌ చేయలేదని అన్నారు. జులై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్‌లో 13, దిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి, హర్యానాలో ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో రెండు కలిసి మొత్తం 69 కేసుల్లో కొత్త సబ్‌ వేరియంట్‌ను గుర్తించినట్టు షీఫ్లాన్‌ తెలిపారు. ఇది రాబోయే ట్రెండ్‌ను సూచిస్తోందని, ఈ వేరియంట్‌ ఆందోనకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే ఈ వేరియంట్‌కు చెందిన వైరస్‌ వ్యాప్తి చెందినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని, దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోన్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img