దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గురువారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. ముఖ్యమంత్రులతో సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తమిళనాడులో ఆదివారాలు లాక్డౌన్ కొనసాగుతోంది.