దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖంపడుతున్నాయి. దేశంలో 24 గంటల వ్యవధిలో 10,72,863 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..10,302 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,99,925కు చేరాయి. ఇందులో 3,39,09,708 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,349 మంది మృతిచెందారు. మరో 1,24,868 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 267 మంది మృతిచెందగా, 11,787 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5,754 కేసులు ఉండగా, 49 మంది మరణించారు. మరో పక్క నిన్న 51,59,931 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 115 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.