దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి. ఇందులో 4,24,98,789 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 11,639 మంది చికిత్స పొందుతుండగా, 5,21,530 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1,222 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, 43 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 79.25 కోట్ల కరోనా టెస్టులు చేశామని, నిన్న ఒక్కేరోజే 4,82,039 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది. .