దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,243 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,96,237కి చేరింది. గడిచిన 24 గంటల్లో 443 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 15,021 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటివరకు మొత్తం 3,36,83,581 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,53,776 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4,58,880గా ఉంది.1,06,85,71,879 మంది టీకా తీసుకున్నారు.