Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 10,549 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 9 వేలు, అంతకంటే తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. అయితే నేడు 10 వేలకుపైగా నమోదయ్యాయి.. దేశవ్యాప్తంగా 10,549 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,45,55,431కి పెరిగాయి. ఇందులో 3,39,77,830 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 4,67,468 మంది మృతిచెందారు.1,10,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 488 మంది మృతిచెందగా, 9868 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.అయితే కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికపైగా కేరళలోనే ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో గురువారం.. 5987 కేసులు నమోదవగా, 384 మంది మృతిచెందారని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img