దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,086 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 71 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. కరోనా నుంచి మరో 1,198 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11,871 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో 5,21,487 మంది మరణించారు. డైలీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉంది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 185.04 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. దేశ వ్యాప్తంగా నిన్న 4,81,374 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 79.20 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.