Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దేశంలో కొత్తగా 11,451 కొవిడ్‌ కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,451 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. కరోనా బారినపడి మరో 266 మంది మృత్యువాతపడ్డారు. యాక్టివ్‌ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొన్నది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.42 శాతం మాత్రమే ఉన్నాయని.. రికవరీ రేటు 98.24 శాతానికి పెరిగిందని తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,43,66,987కు పెరిగింది. ఇందులో 3,37,63,104 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 4,61,057మంది బాధితులు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రాణాలు వదిలారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img