దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4.6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,150 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 83 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 1,194 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,365 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. క్రియాశీల రేటు 0.03 శాతానికి తగ్గింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,21,656కి చేరింది. ఇప్పటి వరకు 4,25,01,196 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకు 185 కోట్లకు పైగా కరోనా డోసులు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 14.7 లక్షల మంది టీకా వేయించుకున్నారు.