Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా నిన్న 555 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది..ప్రస్తుతం దేశంలో 1,36,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 274 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.26 శాతానికిపైగా ఉన్నట్లు తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 1 శాతంగా ఉంది.తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,26,036 కి చేరగా.. మరణాల సంఖ్య 4,63,245 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 12,403 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3.38,26,483 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img