దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కొత్తగా 11,903 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 311 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తంగా 4,59,191 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,51,209 యాక్టివ్ కేసులున్నాయి. 3,36,97,740 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్లో ఇప్పటివరకు 107.29 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.