Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 1,259 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ తగ్గుతున్నాయి.గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్‌ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 1,259 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 35 మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,705 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,378 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,85,534 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 5.21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 1,83,53,90,499 డోసుల వ్యాక్సిన్‌ వేశారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img