దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కరోనా బారినపడి మరో 4,59,873 మంది మరణించగా, 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, 2020, మార్చి తర్వాత యాక్టివ్ కేసుల రేటు కనిష్టానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.43 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 107.63 కోట్లకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.