Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,166 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా నుంచి 26,988 మంది కోలుకున్నారని వివరించింది. కరోనా బారిన 302 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,34,235 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,22,46,884 మంది కోలుకున్నారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,13,226గా ఉంది. అలాగే 1,76,86,89,266 మంది టీకా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img