దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 1335 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775కు చేరింది. ఇందులో 4,24,90,922 మంది కోలుకున్నారు. 5,21,181 మంది మృతిచెందారు. 13,672 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 52 మంది మరణించగా, 1918 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతామని, 98.7 శాతం మంది కోలుకున్నారని, 1.21 శాతం మృతిచెందారని పేర్కొన్నది. 1,84,31,89,377 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని, గురువారం ఒక్కరోజే 23,57,917 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.