Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 1549 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్మాప్తంగా 3.84 లక్షల వైరస్‌ పరీక్షలు నిర్వహించగా, 1,549 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 0.40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో 2,652 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, రికవరీ రేటు 98.74 శాతానికి చేరింది.ఇప్పటివరకు మొత్తం 4,24,67,774 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,510 మంది మృతిచెందగా, 25,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 31 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 1,81,24,97,303 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img