Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దేశంలో కొత్తగా 1,581 పాజిటివ్‌ కేసులు నమోదు

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రెండేళ్ల కనిష్టానికి తగ్గిపోతోంది. గత నాలుగైదు రోజుల నుంచి 2 వేలకు దిగువన పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,581 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 33 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖంపట్టాయి. . ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23,913 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.నిన్న 2,741 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4.30కోట్ల మందికి కరోనా సోకగా, 4.24 కోట్ల మంది కోలుకున్నారు. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో టీకా కార్యక్రమంగా ముమ్మరంగా సాగుతోంది. నిన్న 30,58,879 మంది టీకా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img