Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 179 కరోనా కేసులు..ఒకరు మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 179 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,80,936 కు చేరింది. ఇక యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 2,227 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉండగా తాజాగా ఒకరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,30,725 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 208 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,47,983 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img