దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి 179 మంది మృతి చెందగా.. 26,030 మంది పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,36,97,581కి చేరగా.. 4,47,373 మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,29,58,002 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,206గా ఉంది. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కోటి మందికిపైగా వ్యాక్సిన్ ఇచ్చారు.ఇక మొత్తం టీకాలు తీసుకున్నవారి సంఖ్య 87 కోట్లు దాటింది.