Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,815 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,35,85,554కు చేరాయి. ఇందులో 4,29,37,876 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా, 5,25,343 మంది మృతిచెందారు. మరో 1,22,335 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 38 మంది కరోనాకు బలవగా, 15,899 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ రేటు 4.96 శాతానికి పెరిగింది. ఇక మొత్తం కేసుల్లో 0.28 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.51 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 198.51 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img