Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 20,409 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,409 కరోనా కేసులు నమోదవగా, 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203.60 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img