Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 2,075 కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య రెండు వేలకు చేరింది. దేశవ్యాప్తంగా శుక్రవారం 2,075 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 71 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 0.56 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.దేశంలో ప్రస్తుతం 27,802 (0.06%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,06,080 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,16,352 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,24,61,926 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.73 శాతం ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,81,04,96,924 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది. దేశ వ్యాప్తంగా నిన్న 3,70,514 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.22 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img