Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 228 కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే మన దేశంలో కూడా కరోనా వైరస్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img