Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 25,166 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది.ఇందులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,14,48,754 మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనా బారినపడి మొత్తం 4,32,079 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో కొత్తగా 437 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం వరకు దేశంలో 54.58 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా మహారాష్ట్రలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 76 కి చేరుకుందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఈ కేసుల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img