దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.వైరస్ బారి నుంచి 37,127 మంది పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. 339 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 4,43,213గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 3,24,84,159 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం 3,62,207 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75,22,38,324 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడిరచింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కూడా వేగవంతంగా సాగుతోంది. 75 కోట్ల మార్క్ను దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ట్వీట్ చేశారు. గత 24 గంటల్లో 78,66,950 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపారు.