దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,74,773 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,19,551 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి 3,17,20,112 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 4,35,110 కి చేరింది. నిన్న 39,486 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.29 శాతంగా ఉండగా.. రికవరీ రేట్ 97.37 శాతంగా ఉంది.