Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 25,920 కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖంపట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,920 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న 492 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో 2,92,092 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,27,80,235 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,10,905 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 66,254 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,19,77,238 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,74,64,99,461 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img