Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 26,115 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 26,115 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడిరచింది. కరోనా నుంచి కోలుకుని 34,469 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తాజా కేసులతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య దేశంలో 3,35,04,534 కి చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574గా ఉంది. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 4,45,385కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు 81.85 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img