Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశంలో కొత్తగా 26,727 పాజిటివ్‌ కేసులు


దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 26,727 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.మహమ్మారి కారణంగా 277 మంది మరణించారు. . నిన్న దేశంలో నమోదైన కరోనా గణాంకాల్లో కేరళలో 15,914 కేసులు నమోదు కాగా.. 122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,66,707 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,48,339 కి పెరిగింది. నిన్న 28,246 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,30,43,144 కి పెరిగింది. ఇక వ్యాక్సినేషన్‌ కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 89,02,08,007 మందికి కరోనా టీకా ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 64,40,451 మందికి టీకా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img