Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 27,254 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది. ఇందులో 3,24,47,032 మంది కరోనా నుంచి బయటపడగా, 3,74,269 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,42,874 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 219 మంది మృతిచెందగా, 37,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కొత్త కేసుల్లో కేరళలోనే 20,240 కేసులు ఉన్నాయని, కొత్తగా 67 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది. దీంతో ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img