దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 27,409 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. . దీంతో మొత్తం కరోనా రోగుల సంఖ్య ఇప్పుడు 4,26,92,943కి చేరుకుంది.గడిచిన 24 గంటల్లో కొవిడ్తో 347 మంది మృతి చెందారు. , ఇన్ఫెక్షన్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,09,358కి చేరుకుంది. 82,817 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,23,127కు చేరింది. కొవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా నమోదైంది. సోమవారం నాడు 44,68,365 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు. తాజా గణాంకాల ప్రకారం, భారతదేశంలో మొత్తం టీకా సంఖ్య ఇప్పుడు 1,73,42,62,440కి చేరుకుంది.