దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 30,265 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,78,419కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 43,938 మంది డిశ్చార్జ్ అవగా…295 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 4,45,133కు చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి మరో 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,18,181 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 80.85 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.