దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ఇందులో 3,25,60,474 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకునాÊ్నరు. 3,42,923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరో 4,43,928 మంది మరణించారు. కాగా, గడిచిన 24 గంటల్లో 38,303 మంది కరోనా నుంచి బయటపడగా, 431 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో అత్యధికం కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర బుధవారం ఒకేరోజు 17,681 కేసులు నమోదవగా, 208 మంది చనిపోయారని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 64,51,423 మంది వ్యాక్సిన్ పంపిణీ చేశారు.