Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు

దేశంలో కరోనావైరస్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశవ్యాప్తంగా 30,757 కరోనా కేసులు నమోదు అవగా… 514 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,32,918 యాక్టివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది దేశంలో మహమ్మారి కేసుల 4,27,54,315 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,10,413 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.కాగా.. నిన్న కరోనా మహమ్మారి నుంచి 67,538 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,19,10,984 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,74,24,36,288 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడిరచింది.నిన్న దేశవ్యాప్తంగా 11,79,705 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు 75,55,32,460 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img