దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 30,941 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కరోనా బారినపడి 350 మంది మరణించారు. మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ కారణంగా 4,38,560 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,19,59,680కి చేరింది. ఇక కేరళలో కొత్తగా 19,622 కేసులు వెలుగుచూశాయి. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. మరోవైపు నిన్న ఒక్క రోజులో 59,62,286 మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటిదాకా 64,05,28,644 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.