Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 3,275 పాజిటివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా, 5,23,975 మంది మరణించారు. మరో 19,719 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడిరచింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడిరచింది. ఇప్పటివరకు 1,89,63,30,362 కరోనా డోసులు పంపిణీ చేశామని, బుధవారం ఒకేరోజు 13,98,710 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img