Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్త‌గా 3611 క‌రోనా కేసులు..

దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. వరుసగా మూడోరోజూ 3 వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,73,263 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,611 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,64,289కి చేరింది. ప్రస్తుతం దేశంలో 33,232 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిడ్‌ నుంచి 4,43,99,415 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,642కి ఎగబాకిందని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img