Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 38,628 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,628 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,95,385 కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 617 మంది మృతి చెందారు.మొత్తం ఇప్పటి వరకు కరోనాతో 4,27,371 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 40,017 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,10,55,861 కి పెరిగింది.ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,12,153 ఉన్నాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 50,10,09,609 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img