Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 406 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 406 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,421కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి 4,41,32,433 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,402కు తగ్గాయి. గత 24 గంటల్లో 12 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,586కు చేరింది. ఇక, దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img