Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా 4,129 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా కాటుకు బలయ్యారు. మరో 43,415 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఏడుగురు మృతిచెందగా 4688 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.51 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.72 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 217.68 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img